16 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం.. 35మంది అరెస్ట్

గురువారం, 18 నవంబరు 2021 (17:43 IST)
ఉత్తరప్రదేశ్‌లో 16 ఏళ్ల బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం.. ఆపై హత్యకు సంబంధించిన కేసులో పోలీసులు 35మందిని అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. యూపీలోని పిలిభిత్ జిల్లా బర్ఖెరా సమీపంలోని ఓ గ్రామంలో గత శనివారం ఈ ఘటన జరిగింది. సైకిల్‌పై స్కూలుకు వెళ్లిన బాలిక శనివారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో కంగారు పడిన తల్లిదండ్రులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించారు. 
 
రాత్రి పదకొండు గంటల సమయంలో ఇంటి నుంచి సుమారు అర కిలోమీటరు దూరంలో అర్ధ నగ్నంగా పడి ఉన్న బాలిక మృతదేహాన్ని గుర్తించారు. ఆ పరిసరాల్లో సైకిల్, స్కూల్‌ బ్యాగ్, బీరు బాటిళ్లు కనిపించాయి. తమ బిడ్డను గుర్తు తెలియని వ్యక్తులు గ్యాంగ్ రేప్‌ చేసి చంపేశాని ఆ బాలిక కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. 
 
ఈ ఘటన జరిగి ఐదు రోజులు గడిచినా.. నిందితులను పట్టుకోలేదని.. తమ బిడ్డకు త్వరగా న్యాయం జరగాలంటే కేసు సీబీఐకి అప్పగించాలని కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై ఏడీజీ అవినాశ్ చంద్ర స్పందిస్తూ.. ఈ కేసును మొత్తం 12 టీమ్‌లు ఇన్వెస్టిగేట్‌ చేస్తున్నాయని తెలిపారు. ఇప్పటికే 35 మందిని అరెస్ట్ చేయగా, మరో 10 మందిని ప్రశ్నిస్తున్నామన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు