ఈ యేడాది అద్భుతంగా ఉండాలంటూ ముర్ము - మోడీ - రాహుల్ ఆకాంక్ష

ఆదివారం, 1 జనవరి 2023 (14:14 IST)
కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని దేశ ప్రజలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీలు శుక్షాకాంక్షలు తెలిపారు. ఈ యేడాది అందరికీ అద్భుతంగా ఉండాలంటూ సోషల్ మీడియా వేదికగా వారు ఆకాంక్షించారు. 
 
దేశ ప్రజలతో పాటు విదేశాల్లో ఉంటున్న భారతీయులందరికీ నూతన సంవత్సర శుక్షాకాంహలు. 2023 సంవత్సరం మన జీవితాల్లో కొత్త స్ఫూర్తిని, లక్ష్యాలు, విజయాలను తీసుకురావాలి. దేశం ఐక్యత, సమగ్రత, సమ్మిళిత అభివృద్ధికి మనల్ని మనం పునరంకితం చేసుకోవాలని సంకల్పిద్ధాం అని ముర్ము ట్వీట్ చేశారు. 
 
2023 అందరికీ అద్భుతంగా ఉండాలి. ఆశలు, ఆనందం విజయాలతో నిండి కొత్త యేడాది నిండిపోవాలి. ప్రతి ఒక్కరూ అద్భుతమైన ఆరోగ్యంతో ఆశీర్వదించబడాలి అని ఆకాంక్షించారు. 
 
ప్రతి ఒక్కరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ భారత్ జోడో యాత్ర వీడియోను ట్వీట్ చేశారు. 2023లో ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి నగరం ప్రేమతో నిండిపోవాలని కోరుకుంటున్నాం అంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు