అమ్మ ఆశీర్వాదం తీసుకున్న మోడీ.. కుటుంబ సభ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు

శనివారం, 17 సెప్టెంబరు 2016 (10:22 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 67వ వసంతంలోకి అడుగుపెట్టారు. తన పుట్టిన రోజును ఆడంబరాలకు పోకుండా జరుపుకున్నారు. పుట్టిన రోజు నేపథ్యంలో మోడీ శుక్రవారం రాత్రి అహ్మదాబాద్‌‌లోని 97 యేళ్ళ కన్నతల్లి హీరాబా నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన తన కుటుంబ సభ్యులతో 30 నిమిషాల పాటు గడిపారు. 
 
కుమారుడిని ఆమె మనసారా ఆశీర్వదించారు. అక్కడ ఆయనకు రాష్ట్ర గవర్నర్ కోహ్లీ, సీఎం విజయరూపానీ, బీజేపీ నేతలు ఘనంగా స్వాగతం పలికారు. ప్రధాని మోడీకి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్, అరుణ్ జైట్లీ, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా తదితరులు శుభాకాంక్షలు తెలియజేశారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఠాకూర్ నేరుగా ప్రధాని మోడీని కలసి శుభాకాంక్షలు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి