దివ్యాంగుణిని చితకబాదిని జవాన్లు - వీడియో వైరల్

సోమవారం, 31 జులై 2023 (13:58 IST)
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని దేవరియాలో సన్నింగ్ (26) అనే దివ్యాంగుణిని ప్రాంతీయ రక్షక్ దళానికి చెందిన ఇద్దరు జవాన్లు చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన జరిగిన సమీపంలోని భవనం పైనుంచి ఓ వ్యక్తి దీన్ని వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది. సచిన్ 2016లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోయాడు. సిమ్ కార్డులు విక్రయిస్తూ, స్థానిక రెస్టారెంటులో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. 
 
శనివారం రాత్రి మూడు చక్రాలవాహనంపై ఇంటికి బయలుదేరిన సచిన్‌కు గుడికి సమీపంలో ఓ తాబేలు కనిపించింది. కిందకి దిగి, దాన్ని ఆలయ కొలనులో వదిలి తిరిగి వచ్చాడు. అక్కడ ప్రాంతీయ రక్షక్ దళ్ జవాన్లు ఇద్దరు కనిపించేసరికి నీళ్లు అడిగాడు. అంతే.. దుర్భాషలాడుతూ సచిన్‌ను వారిద్దరూ చావగొట్టారు. ఆ జవాన్లను రాజేంద్రమణి, అభిషేక్ సింగ్ గుర్తించి.. ఇద్దరినీ పూర్తిగా విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఎస్పీ సంకల్పశర్మ తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు