మేకను మింగిన కొండచిలువ.. కదల్లేక కష్టాలు పడింది.. చివరకు..?

సోమవారం, 28 సెప్టెంబరు 2020 (12:48 IST)
వన్యప్రాణులకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఓ కొండ చిలువను అటవీ శాఖ అధికారులు కాపాడారు. వివరాల్లోకి వెళితే.. రామ్ పూర్ జిల్లాలోని సిహారి గ్రామంలో ఆదివారం నాడు ఓ భారీ కొండచిలువ కనిపించింది. అప్పుడే ఏదో జీవిని మింగినట్లుగా కనిపించగా.. కదల లేకుండా పోయింది. అటవీ ప్రాంతానికి దగ్గరలో ఈ కొండా చిలువ కనిపించింది.
 
సాధారణంగా తినే జంతువు కంటే మరేదో జంతువును మిగిందని స్థానికులు భావించారు. కనీసం కదలడానికి కూడా ఆ కొండ చిలువకు వీలు కాలేదు. ఆ కొండచిలువను చూస్తూ స్థానికులు కూడా కాస్త భయాందోళనకు గురయ్యారు. దీంతో ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. 
 
డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. సిహారి గ్రామంలో ఆ కొండచిలువ కనిపించింది. మా టీమ్ కొండ చిలువను పరిశీలించి.. స్థానికంగా ఉన్న అడవిలో వదిలిపెట్టి వచ్చారు. ఆ కొండచిలువ మేకను మింగినట్లు ఉంది. అందుకే కదలలేకపోయిందని చెప్పారు. ఆ కొండ చిలువను ఓ ట్రాక్టర్‌లో వేసుకుని  తరలించినట్లు తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు