ఐసీయూలో మహిళపై అత్యాచారం.. ఇంజెక్షన్ ఇచ్చి ఆపై కర్టెన్లను కప్పుకుని?

సెల్వి

మంగళవారం, 27 ఫిబ్రవరి 2024 (20:43 IST)
రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఓ ప్రైవేట్ ఆసుపత్రి ఐసీయూలో చేరిన 24 ఏళ్ల మహిళపై నర్సింగ్ అసిస్టెంట్ మంగళవారం అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలు మహిళ ఊపిరితిత్తుల ఇన్‌ఫెక్షన్ కారణంగా ఆసుపత్రిలో చేరిందని, ఐసియులో చికిత్స పొందుతోంది. 
 
నిందితుడు చిరాగ్ యాదవ్ మంగళవారం తెల్లవారుజామున 4 గంటలకు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది. నిందితుడు తనకు ఇంజెక్షన్ ఇచ్చాడని, ఆ తర్వాత ఆమె అపస్మారక స్థితికి చేరుకుందని పోలీసులు తెలిపారు.
 
తన భర్త మొబైల్‌కి కాల్ చేయడంతో మహిళ స్పృహలోకి వచ్చిందని.. ఆమెపై తనకు జరిగిన ఘోరం గురించి తన కుటుంబ సభ్యులకు తెలిపింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని.. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
నిందితుడి బాధితురాలి బెడ్‌పైకి వెళ్లి కర్టెన్‌లతో కప్పుకున్నట్లు కనిపించిన సీసీటీవీ ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు