పొద్దస్తమానం స్మార్ట్ ఫోన్ చూసిన బాలుడు... మెమెరీ లాస్... ఎక్కడ?

గురువారం, 13 జులై 2023 (09:53 IST)
రాజస్థాన్ రాష్ట్రంలో ఓ విషాదకర ఘటన జరిగింది. పొద్దస్తమానం అదేపనిగా స్మార్ట్ ఫోన్‌ చూస్తూ గడిపిన ఓ బాలుడికి మెమరీ లాస్ అయింది. ఆ బాలుడి వయసు పదేళ్లు. ఇపుడు మతిస్థిమితం కోల్పోయాడు. ఈ ఘటన రాష్ట్రంలోని అల్వార్‌లో వెలుగు చూసింది. 
 
సాధారణంగా స్మార్ట్ ఫోన్లు ఇవ్వకుంటే చిన్నారులు మారాం చేస్తుంటారు. కాస్త ఎదిగిన పిల్లలు అయితే ప్లే స్టోర్ల నుంచి వివిధ రకాలన ఆటలు డౌన్‌లోడ్ చేసుకుని పొద్దస్తమానం ఆడుతూనే ఉంటారు. స్మార్ట్ ఫోనే తమ లోకంగా జీవిస్తుంటారు. ఇలా స్మార్ట్‌ ఫోన్లకు బానిసైన కొందరు పిల్లలు అరుదైన వ్యాధుల బారినపడుతున్నారు. 
 
తాజాగా ఆల్వార్‌కు చెందిన బాలుడు ఇదేవిధంగా మతిస్థిమితం కోల్పోయాడు. అతనికి ప్రత్యేక పాఠశాలలోని నిపుణుల సాయంతో చికిత్స అందిస్తున్నారు. ఈ బాలుడు పొద్దస్తమానం స్మార్ట్ ఫోనులో ఫ్రీపైర్ ఆటలోనే గడిపేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఇలా ఆడుతూ ఆడుతూ ఓ సారి కిందపడిపోయాడని, దాన్ని తట్టుకోలేక మతిస్థిమితం కోల్పోయినట్టు చెప్పాడు. ప్రత్యేకంగా భౌతిక ఆటలు, ఆడిస్తూ, అతడికి నయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చికిత్స అందిస్తున్న మానసికనిపుణులు చెప్పారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు