అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వెడ్డింగ్- చెర్రీ దంపతులు హాజరు.. రిసెప్షన్‌కు చంద్రబాబు

సెల్వి

శనివారం, 13 జులై 2024 (09:20 IST)
Upasana_Ramcharan
ముంబైలో జరుగుతున్న అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహానికి టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు హాజరయ్యారు. వీరితో పాటు అఖిల్ ఈ వేడుకకు హాజరయ్యారు.

రామ్ చరణ్, ఉపాసన సింపుల్‌గా సంప్రదాయ దుస్తులు ధరించి ఈ పెళ్లి వేడుకలో కనువిందు చేశారు. ఉపాసనతో కలిసి కొన్ని ఫొటోలకు పోజులిచ్చిన రామ్ చరణ్... విడిగా మరికొన్ని ఫొటోలకు పోజులిచ్చారు.
 
రిలయన్స్‌ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత ముఖేశ్‌ అంబానీ తనయుడు అనంత్ అంబానీ-రాధికా మర్చంట్‌ల వివాహం శుక్రవారం రాత్రి అంగరంగ వైభవంగా పూర్తయింది. శనివారం రాత్రి ముంబైలో కొంతమంది అతిథులకు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. 
Chandra babu
 
ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు హాజరు కానున్నారు. ఈ రోజు సాయంత్రం ముంబైకి చేరుకుని రాత్రి రిసెప్షన్‌లో పాల్గొంటారు. రాత్రికి ముంబైలోనే బస చేసి మరుసటి రోజు మధ్యాహ్నం ఆయన అమరావతి చేరుకోనున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు