బెంగళూరులో అరుదైన శ్వేతనాగు.. తెలుపు రంగులో మెరిసిపోయింది..

మంగళవారం, 28 మే 2019 (14:08 IST)
బెంగళూరు మహానగరంలో అరుదైన శ్వేతనాగు కనిపించింది. సిలికాన్ సిటీలోని న్యాయంగ లేఅవుట్ వద్ద పూర్తిగా తెలుగు రంగులో మెరిసిపోతున్న ఆ నాగుపామును చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు. నాగుపాముకు భిన్నంగా తెల్లని రంగులో వున్న ఆ విష సర్పాన్ని చూసిన ప్రజలు స్నేక్ క్యాచర్‌కు సమాచారం ఇచ్చారు. 
 
స్థానికుల సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్.. ఆ పామును పట్టుకుని అందరికీ చూపెట్టారు. ఇది చాలా అరుదైన సర్పం అని, ఇలాంటివి సాధారణంగా అడవుల్లో ఉంటాయని చెప్పారు. అడవుల్లో వుండే ఈ శ్వేతనాగులు ప్రజలుండే ప్రాంతాల్లో కనిపించడం అరుదని చెప్పారు. ఇక మోహన్ పట్టుకున్న శ్వేతనాగును అడవుల్లో వదిలేయనున్నట్లు చెప్పారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు