ప్రస్తుతం ఉన్న దర్శన సమయాన్ని మరో గంట పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటివరకు రెండో దశలో సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అయ్యప్ప స్వామి భక్తులకు దర్శనం ఇస్తుండగా, ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటల నుంచి దర్శనం ప్రారంభించి రాత్రి 11 గంటల వరకు కొనసాగించాలని నిర్ణయించారు.
అయ్యప్ప ఆలయ ఏర్పాట్లను చూస్తున్న ఐజీ స్పర్జన్ కుమార్ మాట్లాడుతూ.. వర్చువల్ క్యూ ద్వారా 90 వేలు, అక్కడికక్కడే 30 వేల బుకింగ్లు జరుగుతున్నాయని తెలిపారు. మహిళలు, వృద్ధులు, చిన్నారులు అధిక సంఖ్యలో వస్తుండటంతో దర్శనాలకు కొంత అంతరాయం కలుగుతోందని తెలిపారు.
అయితే అయ్యప్ప దర్శన వేళలను రోజూ 17గంటలకు మించి పొడిగించలేమని ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు స్పష్టం చేసింది. అయ్యప్పను దర్శించుకునేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. క్యూలో వేచి ఉన్న భక్తులకు మంచి నీళ్లు, బిస్కెట్లు అందిస్తున్నామని బోర్డులో పేర్కొన్నారు.