ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్.. సొంత పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్పై విమర్శలు గుప్పించారు అంతటితో ఆగని ఆయన ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే సమర్థవంతమైన పాలన అందించగలరని ఆయన చెప్పుకొచ్చారు.