కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే బెస్ట్ : ఆప్ నేత శాంతి భూషణ్

శుక్రవారం, 23 జనవరి 2015 (10:52 IST)
ఆమ్ ఆద్మీ పార్టీ వ్యవస్థాపకుల్లో ఒకరైన శాంతి భూషణ్.. సొంత పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌పై విమర్శలు గుప్పించారు అంతటితో ఆగని ఆయన ఢిల్లీ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి కిరణ్ బేడీపై మరోమారు ప్రశంసల వర్షం కురిపించారు. కేజ్రీవాల్ కంటే కిరణ్ బేడీనే సమర్థవంతమైన పాలన అందించగలరని ఆయన చెప్పుకొచ్చారు.
 
ఆయన ఓ ప్రైవేట్ టీవీ చానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరవింద్ కేజ్రీవాల్లో రాజకీయాల్లో విఫలమయ్యారన్నారు. అందువల్ల కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చెయాలని డిమాండ్ చేశారు. 
 
‘కేజ్రీవాల్‌లో కేవలం విజయకాంక్ష మాత్రమే ఉంది. ఆప్ ప్రధాన లక్ష్యం అది కాదు. ఈ కారణంగా కేజ్రీవాల్ పార్టీ అధ్యక్ష పదవి నుంచి వైదొలగాల్సిందే. కేజ్రీవాల్ తన చుట్టూ ఓ వలయాన్ని ఏర్పరచుకున్నారు. ఆ వలయం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తోంది’ అని శాంతి భూషణ్ ఆరోపించారు. 

వెబ్దునియా పై చదవండి