ఇంటిని వ్యభిచారకూపంగా మార్చేసిన తండ్రి.. కొడుకు ఏం చేశాడంటే?

మంగళవారం, 18 సెప్టెంబరు 2018 (13:11 IST)
ఇంటినే వ్యభిచారకూపంగా మార్చేసిన తండ్రిని కన్నకొడుకు హతమార్చాడు. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. కుటుంబసభ్యుల్ని ఇంటి నుంచి తరిమికొట్టి.. ఆ ఇంట్లోనే వ్యభిచారం నడిపాడు ఓ వ్యక్తి. తండ్రి చేస్తున్న పనికి విసిగిపోయిన కుమారుడు తండ్రిని హత్య చేశాడు. ఈ ఘటన తమిళనాడు, మక్కజిల్లా, సేడమంగళంలో జరిగింది.  
 
వివరాల్లోకి వెళితే, సేడ మంగళం సమీపం పోలుకురిచ్చిలో దంపతులు పెరియసామి (45), మణిమేగలై దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె వున్నారు. పెరియసామి ట్రాక్టర్‌ డ్రైవర్‌ పనిచేస్తూ రోజూ పీకల దాకా తాగి ఇంటికొచ్చి భార్యాపిల్లలతో గొడవపడుతుండేవాడు. తాగుడు మానమని చెప్పినా ఒప్పుకునేవాడు కాదు. తాగొచ్చి కొడుకులను చితకబాదేవాడు. అంతేకాదు భార్యాపిల్లలను ఇంటినుంచి గెంటేసిన అతడు.. ఆ ఇంట్లో ఇతర స్త్రీలతో వ్యభిచారం చేయించాడు.
 
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పెరియసామి ఇంటి తలుపులు తెరచి ఉండటం, లోపల నుంచి ఎలాంటి అలికిడి వినిపించకపోవడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఇంటిని పోలీసులు పరిశీలించగా పెరియ సామి హత్యకు గురైనట్లు తెలిసింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆపై పెరియసామి భార్య, కుమారుల వద్ద పోలీసులు విచారణ జరిపారు. ఆ విచారణలో తన తండ్రిని తానే కత్తితో పొడిచి హత్యచేశానని కొడుకు అజిత్ అంగీకరించాడు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు