తమిళనాడులో ఘోరం.. ఆరు వాహనాలు ఢీ - ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి మృతి

మంగళవారం, 3 జనవరి 2023 (10:51 IST)
తమిళనాడు రాష్ట్రంలో మంగళవారం ఉదయం ఘోరం జరిగింది. ఒకే సమయంలో ఆరు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ప్రమాదానికి గురైన వాహనాల్లో రెండు ప్రైవేటు బస్సులు, రెండు లారీలు, రెండు కార్లు ఉన్నాయి. 
 
మంగళవారం ఉదయం కడలూరు జిల్లా వెప్పూరు వద్ద ఈ ప్రమాదం జరిగింది. చనిపోయినవారంతా కార్లలో ప్రయాణిస్తున్న వారే. దీనిపై సమాచారం అందుకున్న కడలూరు జిల్లా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని సమీపంలోని ఆస్పత్రి మార్చురీకి తరలించారు. 
 
క్షతగాత్రులను ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. అయితే, మృతుల వివరాలు తెలియాల్సివుంది. పోలీసుల ప్రాథకమి సమాచారం మేరకు.. మృతులంతా చెన్నైకు చెందినవారిగా భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు