గత నవంబర్ 24న వేద నిలయాన్ని జయలలిత వారసులైన దీపకు, ఆమె సోదరుడికి అప్పగించాలని తీర్పు వెలువరించింది. దీనితో ఆ ఇంటి తాళాలను జిల్లా కలెక్టర్ అధికారికంగా దీపకు అందించారు. తన మేనత్త వేద నిలయం ఇంటి తాళాలు తమకు ఇవ్వడంతో దీప ఎంతో సంతోషంగా కనిపించారు. తన మేనత్త ఆత్మ ఇప్పుడు శాంతిస్తుందని అన్నారు.