అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రతి ఒక్కరినీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేశారు. ఏడు పదులు దాటిన వయసులో ఏకబిగువున 51 పుషప్స్ తీశారు. శనివారం మదురైలో జరిగిన ప్రపంచ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పుషప్స్ తీయగా, దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మదురైలోని వేలమ్మాళ్ విద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన యోగా వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఇక్కడ తన ఫిట్నెస్తో అక్కడున్న వారందరినీ మంత్రముగ్ధులను చేశారు. ఏమాత్రం అలసట అనేది లేకుండా ఏక బిగువున 51 సార్లు పుషప్స్ పూర్తి చేశారు. ఆయన ఉత్సాహంగా పుషప్స్ చేస్తుండగా, అక్కడున్నవారంతా తమ కరేతాళ ధ్వనులతో అభినందించారు.