పని ఒత్తిడి తట్టుకోలేక ఓ చార్టర్డ్ అకౌంటెంట్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాద్లోని గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ విషాదం వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్లో సురేశ్ రెడ్డి (28) అనే యువకుడు ఓ కంపెనీలో సీఏగా పనిచేస్తున్నాడు. అతని సోదరుడితో కలిసి మణికొండలో ఉంటున్నాడు.