జార్ఖండ్ సీఎంతో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

శనివారం, 5 మార్చి 2022 (11:07 IST)
జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సోరెన్‌తో తెలంగాణ సీఎం భేటీ అయ్యారు. గాల్వాన్‌ లోయలో అమరులైన జవాన్ల కుటుంబాలకు జార్ఖండ్ సీఎంతో కలిసి 10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. 
 
పీపుల్స్‌ ఫ్రంట్‌ ఏర్పాటుపై హేమంత్ సొరెన్‌తో కేసీఆర్ చర్చించారు. అనంతరం సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ హేమంత్ సోరెన్‌తో దేశ రాజకీయాలపై చర్చించినట్లు తెలిపారు. 
 
తెలంగాణ ఏర్పాటుకు శిబు సోరెన్ సహకరించారని గుర్తు చేశారు. త్వరలో అందరం కలుస్తామని చెప్పారు. దేశాభివృద్ధికి ఎలాంటి ప్రణాళిక కావాలో చర్చిస్తామని తెలిపారు. ఎవరికి అనుకూలం, ఎవరికి వ్యతిరేకమనేది కాదన్నారు. 
 
ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శించారు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో దేశం సరిగా అభివృద్ధి కాలేదని పేర్కొన్నారు. జార్ఖండ్ పర్యటన అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇవాళ ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుంటారు.
 
కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న కేసీఆర్.. నేతలతో వరుసగా సమావేశమవుతుండడం చర్చనీయాంశంగా మారింది. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ, తమిళనాడు సీఎం స్టాలిన్ సీఎంతోనూ సంప్రదింపులు జరుపుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు