మొన్న ముంబై నిన్న హైదరాబాద్ ఇపుడు చెన్నై.. ఈ వారంలోనే రెండు తుఫాన్లు!

గురువారం, 5 అక్టోబరు 2017 (13:01 IST)
ఈ యేడాది వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయి. మొన్నటికిమొన్న ముంబై మహానగరాన్ని భారీ వర్షాలు అస్తవ్యస్తం చేశారు. అలాగే, నిన్నటికి నిన్న హైదరాబాద్ నగరాన్ని ముంచేసింది. ఇక చెన్నై నగరం వంతు రానుంది. వరుసగా రెండు తుఫాను చెన్నై నగరాన్ని తాకనున్నాయట. 
 
సాధారణంగా నవంబర్ - డిసెంబర్‌ నెలలు వచ్చాయంటేనే నగర ప్రజలు ఉలిక్కిపడతారు. ఇక వరుసగా రెండు తుఫాన్లు వస్తున్నాయంటే పరిస్థితి ఎలా ఉంటుందోనంటూ అధికార యంత్రాంగం ఆందోళన చెందుతోంది. వారం రోజుల వ్యవధిలో రెండు తుపాన్లు విరుచుకుపడనున్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 
 
ఈ రెండు తుఫాన్ల ప్రభావంతో నగరం సహా పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ పరిశోధన కేంద్రం అధికారులు ప్రకటించారు. బంగాళాఖాతంలో ఈ నెల 7న ఓ వాయుగుండం తుఫానుగా మారి 11న చెన్నై తీరాన్ని తాకుతుందని తెలిపింది. 
 
ఆ తర్వాత 12న మరో వాయుగుండం తుఫానుగా మారి 15 నుంచి 20వ తేదీలోపున చెన్నై తీరాన్ని దాటుతుందని తెలిపారు. ఈ నెల 11లోపున తీరం దాటే తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండి భారీగా వర్షాలు కురుస్తాయని అధికారులు చెపుతున్నారు. 
 
ఈ రెండు తుపాన్లు కడలూరు - నెల్లూరు మధ్య తీరం దాటడం ఖాయమని అంటున్నారు. ఈ రెండు తుఫానుల వల్ల ఈశాన్య రుతుపవనాలు తోడై మామాలు స్థాయికన్నా 111 శాతం అధికంగా వర్షాలు కురుస్తాయని వారు అంచనా వేస్తున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు