అత్యాచారాలకు పాల్పడిన వారు తమను బతకనివ్వమని వేడుకోవాలి.. అలాంటి వారిని తలకిందులుగా వేలాడదీసి చితకబాది వారి దెబ్బలపై కారం పూయాలి. వాళ్లు గట్టి గట్టిగా ఏడుస్తుంటే.. అరుస్తుంటే బాధిత మహిళలు చూడాలని కేంద్ర మంత్రి ఉమాభారతి అన్నారు. తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రేపిస్ట్ల భరతం పట్టానని ఉమాభారతి తెలిపారు. రేపిస్టులను హింసించి, క్షమించమని బాధితుల కాళ్లు పట్టుకునేలా చేశానన్నారు.