సంతానంకోసం చిన్నారిని బలిచ్చిన ఓ మహిళ

సోమవారం, 22 మార్చి 2021 (15:46 IST)
ఓ మహిళ తన సంతానం కలగకపోవడంతో రెండేళ్ళ చిన్నారిని ఓ మహిళ బలిచ్చింది. పిల్లలు పుట్టకపోవడంతో మాంత్రికుడ్ని ఆశ్రయించిన ఆ మహిళ.... బాలుడి ప్రాణాల తీసింది. ఈ విషాదకర ఘటన ఢిల్లీలోజరిగింది.
 
రోషిణీ ప్రాంతానికి చెందిన 25 ఏండ్ల మహిళకు 2013లో వివాహమైంది. అయితే, ఆమెకు పిల్లలు కలగక పోవడంతో తోడికోడళ్లు, మెట్టింటి వారు హేళన చేయసాగారు. 
 
ఇది భరించలేక నాలుగేండ్ల కిందట పుట్టిల్లు అయిన ఉత్తరప్రదేశ్‌లోని హార్డోయిలో క్షుద్రపూజలు చేసే ఒక వ్యక్తిని ఆశ్రయించింది. సంతానం కలుగాలంటే ఒక చిన్నారిని బలి ఇవ్వాలని అతడు సూచించాడు.
 
ఈ నేపథ్యంలో ఢిల్లీలో నివాసం ఉంటున్న ఆ మహిళ పొరుగున్న ఉన్న రెండున్నర ఏండ్ల బాలుడ్ని చంపాలని నిర్ణయించుకున్నది. శనివారం పక్క బిల్డింగ్‌ మేడపై ఒంటరిగా ఆడుకుంటున్నఆ చిన్నారి గొంతునులిమి హత్య చేసింది. అనంతరం మృతదేహాన్ని ఒక బ్యాగ్‌లో అక్కడ ఉంచింది.
 
మరోవైపు తమ కుమారుడు కనిపించకపోవడంతో బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ చిన్నారి గురించి పోలీసులు ఆరా తీసి గాలించగా బిల్డింగ్‌ మేడపై ఒక బ్యాగ్‌ కనిపించింది. 
 
దానిని తెరిచిచూడగా బాలుడి మృతదేహం అందులో ఉన్నది. దీనిపై దర్యాప్తు చేయగా ఆ చిన్నారిని తానే చంపినట్లు ఆ మహిళ ఒప్పుకున్నది. దీంతో పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు