యశోదాబెన్‌ను మోదీ భార్యగా స్వీకరించాలి.. లేకుంటే?

శనివారం, 6 జనవరి 2018 (14:03 IST)
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భార్యను అంగీకరించాలని.. లేకుంటే జెడ్ కేటగిరీ భద్రతను తొలగించాలని డిమాండ్ చేస్తూ.. అఖండ భారత ఉద్యమ వ్యవస్థాపకురాలు డాక్టర్ పాలెపు సుశీల నిరాహార దీక్ష చేపట్టారు.

హైదరాబాదు మియాపూర్‌లోని న్యూ హఫీజ్ పేటలో క్లినిక్ నడుపుతున్న సుశీల మాట్లాడుతూ.. మోదీ జశోదబెన్‌తో చేసుకున్న వివాహం చెల్లదన్నప్పుడు.. ఆమెకు జెడ్ కేటగిరీ భద్రత ఎలా కల్పిస్తారని ప్రశ్నించారు. యశోదబెన్‌కు మద్దతుగా సుశీల చేపట్టిన ఈ నిరాహార దీక్ష ఆరో రోజుకు చేరింది. 
 
ఇదిలా ఉంటే... తనకు జెడ్ కేటగిరీ ఇవ్వడంపై యశోదా బెన్ కూడా విముఖత వ్యక్తం చేస్తున్నారు. తనకు ఏ హోదాలో భద్రత కల్పిస్తున్నారో తెలపాలని సమాచార హక్కు చట్టం కింద జశోదాబెన్ దరఖాస్తు చేసుకున్నారు. తాను ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణిస్తుండగా, తన భద్రతా సిబ్బంది ప్రత్యేక వాహనాలు వాడుతుండటం చాలా ఇబ్బందిగా వున్నట్లు ఆమె అసహనం వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు