సివిల్స్ 2021 ఫలితాలను వెల్లడి - తెలుగు అభ్యర్థులకు ర్యాంకుల పంట

సోమవారం, 30 మే 2022 (15:39 IST)
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ 2021 ఫలితాలను సోమవారం విడుదల చేసింది. ఈ పరీక్షా ఫలితాల్లో మొత్తం 985 మంది సివిల్ సర్వీస్‌కు ఎంపికయ్యారు. వీరిలో 180 మంది ఐఏఎస్‌కు, ఐఎఫ్ఎస్ 37 మంది, ఐపీఎస్ 200మంది చొప్పున ఎంపికయ్యారు. ఇందులో శృతి శర్మకు అఖిల భారత స్థాయిలో మొదటి స్థానం లభించగా, అంకిత అగర్వాల్‌కు రెండో ర్యాంకు లభించింది. మూడో ర్యాంకు గామిని సింగ్మా సాధించారు. 
 
ఇకపోతే, తెలుగు రాష్ట్రాలకు చెందిన యశ్వంత్ కుమార్ రెడ్డికి 12వ ర్యాంకు, పూసపాటి సాహిత్యకు 24వ ర్యాంకు, శృతి రాజ్యలక్ష్మికి 25వ ర్యాంకు, రవికుమార్‌కు 38వ ర్యాంకు, కొప్పిశెట్టి కిరణ్మయికి 56వ ర్యాంకు, పాణిగ్రాహి కార్తీక్‌కు 63వ ర్యాంకు, గడ్డం సుధీర్ కుమార్ రెడ్డికి 69వ ర్యాంకు, శైలజకు 83వ ర్యాంకు, శివానందంకు 87వ ర్యాంకు, ఆకునూరి నరేష్‌కు 117వ ర్యాంకు, అరుగుల స్నేహకు 136వ ర్యాంకు, గడిగె వినయ్ కుమార్‌కు 151వ ర్యాంకు, కన్నెధార మనోజ్ కుమార్‌కు 157వ ర్యాంకు, చైతన్య రెడ్డికి 161వ రెడ్డికి, దొంతుల జీనత్ చంద్రకు 201 ర్యాంకు, అకవరం సాస్య రెడ్డికి 214వ ర్యాంకులు  వచ్చాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు