ఈ నెల 20, 21వ తేదీల్లో హెలికాప్టర్ ద్వారా భారత బలగాలు నియంత్రణ రేఖను దాటి పాక్ ఆక్రమిత కాశ్మీర్(పీవోకే)లో అడుగుపెట్టి కనీసం 20 మంది ఉగ్రవాదులను హతమార్చినట్టు సమాచారం. సైనికులతో కూడిన పారాచూట్ రెజిమెంట్ బలగాలు ఈ ఆపరేషన్లో పాల్గొన్నట్టు సమాచారం. పీవోకేలోని మూడు ఉగ్ర శిబిరాలపై భారత సైన్యం చేసిన దాడిలో 18 మంది ముష్కరులు ప్రాణాలు కోల్పోగా 180 మందికిపైగా తీవ్రంగా గాయపడిన విషయం తెల్సిందే.