గోమాత ప్రేమ.. కుక్క పిల్లలకు పాలిస్తున్న ఆవు

శనివారం, 5 జనవరి 2019 (09:00 IST)
మన దేశంలో గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. అలాంటి ఓ ఆవు తల్లి ప్రేమను చూపిస్తూ, నాలుగు కుక్క పిల్లలకు పాలిస్తోంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
 
ఈ వివరాలను పరిశీలిస్తే, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఓ ఆవు శునకాలపై వాత్సల్యం కురిపిస్తోంది. ఈ సంఘటన అరుదైన ఘటన చోటుచేసుకుంది. ఈ ఆవు తల్లి ప్రేమను చూపిస్తూ నాలుగు కుక్క పిల్లలకు పాలిస్తోంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం ఆ కుక్క పిల్లల తల్లి రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. ఇటువంటి పరిస్థితిలో ఆ కుక్క పిల్లలకు ఆవు పాలిచ్చింది. దీనిని ఒక వ్యక్తి తన కెమెరాలో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇప్పుడిది వైరల్‌గా మారింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు