భార్యకు హెచ్ఐవి ఇంజెక్షన్ ఇచ్చిన భర్త.. ఎక్కడ?

మంగళవారం, 14 సెప్టెంబరు 2021 (12:39 IST)
ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. హెచ్‌ఐవి రోగికి ఉపయోగించిన సూదితో గర్భిణి అయిన తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు ఒక భర్త. విడాకులు కావాలంటూ ఈ విధంగా అమానవీయంగా ప్రవర్తించాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదుతో ఈ పాశవిక ఘటన వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే.. నిందితుడు మహేశ్‌ గౌతమ్‌ అలీగఢ్‌లోని ఒక ఆస్పత్రిలోని ల్యాబ్‌లో కాంట్రాక్టు టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు.
 
గతేడాది డిసెంబర్‌లో అతడికి ఒక యువతితో వివాహం జరిగింది. అయితే మహేశ్‌కు సహోద్యోగినితో అక్రమ సంబంధం ఉందని భార్యకు తెలిసింది. ఈ విషయంపై ఆమె నిలదీయడంతో.. ఆమెను విడాకులు కావాలంటూ వేధించడం ప్రారంభించాడు.
 
ఈ క్రమంలోనే ఒక హెచ్‌ఐవి రోగికి ఇచ్చిన సూదితోనే మహేశ్‌ తన భార్యకు ఇంజెక్షన్‌ చేశాడు. ఈ విషయాన్ని ఆమె తండ్రికి తెలియజేయడంతో ఆయన పోలీసులను ఆశ్రయించారు. తను గర్భవతి అని తెలిసినప్పటి నుంచే భర్త తనకు హెచ్‌ఐవిని సోకేలా చేసేందుకు యత్నిస్తున్నాడని బాధితురాలు పేర్కొంది. 
 
తన కుమార్తె అత్తామామలతో పాటు ఆస్పత్రి యజమాని కూడా ఈ కుట్రకు పాల్పడ్డారని తండ్రి ఆరోపించారు. వీరంతా బంధువులే అని పేర్కొన్నారు. నిందితులతో పాటు ఆస్పత్రి యాజమాన్యంపై పోలీసులు వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు