భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు.. పెళ్లైన 20 రోజులకే జంప్

బుధవారం, 23 మార్చి 2022 (09:43 IST)
అక్రమ సంబంధాల కారణంగా నేరాల సంఖ్య పెరిగిపోతోంది. వివాహ వ్యవస్థతో ముడిపడి వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్న కొందరు తమ సంతోషం కోసం హత్యలు చేసేందుకైనా వెనుకాడట్లేదు. తాజాగా పెళ్లైన 20 రోజులకే నవ వధువు.. భర్తతో సంసారం.. మరిదితో రాసలీలలు సాగించింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని పురాన్‌పూర్ కొత్వాలి ప్రాంతానికి చెందిన ఓ యువకుడికి.. పిలిబిత్‌కు చెందిన ఓ యువతితో 20రోజుల క్రితం ఘనంగా వివాహం జరిగింది.
 
కుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో వివాహం చాలా గ్రాండ్‌గా జరిపించారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్న.. అత్తగారింటికి వచ్చిన కొత్తకోడలు తనలోని మరోకోణాన్ని బయటపెట్టింది. 
 
పెళ్లి జరిగి సరిగ్గా 20రోజుల గడవక ముందే.. అత్తగారి కుటుంబానికి చెందిన వరుసకు మరిది అయ్యే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది. భర్తను మోసం చేస్తూ.. అతనితో రాసలీలలు సాగించింది. 
 
ఇదే ఇంట్లో ఉంటే వీరికి కామక్రీడలు సాగవని ఏకంగా అతనితో కలిసి ఇంట్లో నుండి జంప్ అయింది. విషయం తెలసుకున్న భర్త కుటుంబ సభ్యులు షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు