20 ఏళ్ల క్రితం మధ్యప్రదేశ్లోని భోపాల్ నుంచి వడోదరకు చాందిని రాజ్గౌర్ అనే యువతి తన తల్లిదండ్రులతో కలిసి వడోదరకు చేరుకుంది. ఈమె తన ఫేస్ బుక్ ఖాతాలో తన ఫొటో అప్లోడ్ చేసి, దానికింద ఓ సందేశం ఉంచింది. తల్లిదండ్రులకు వైద్య చికిత్స చేయించేందుకు అవసరమైన డబ్బు కోసం తనను తాను అమ్ముకుంటున్నానని ఆ సందేశంలో పేర్కొంది.
తల్లిదండ్రులు మంచాన పడడంతో వారి ఆలనాపాలన అంతా చాందినీయే కొన్నేళ్లుగా చూసుకుంటోంది. ఈ విషయం తెలుసుకున్న ఓ జాతీయ మీడియా ఆమెను సంప్రదించగా, తనను తాను అమ్ముకోవడం తప్ప తనకు మరోమార్గం కనిపించలేదని, అందుకే అమ్మకానికి పెట్టుకున్నట్టు తెలిపింది.