రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్: వెంక‌య్య‌నాయుడు

బుధవారం, 6 జులై 2016 (19:39 IST)
న్యూఢిల్లీ: భార‌తదేశ అభివృద్ధి ఇపుడు ప్ర‌జా స‌మాచార వార‌ధిపై ఆధార‌ప‌డి ఉంద‌ని కేంద్రమంత్రి వెంక‌య్య‌ నాయుడు అన్నారు. రిఫార్మ్, పెర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్ అండ్ ఇన్‌ఫార్మ్ అంటూ త‌న‌దైన శైలిలో ఆయ‌న దేశాభివృద్ధిని అభివ‌ర్ణించారు. కేంద్ర స‌మాచార, ప్ర‌సార శాఖ మంత్రిగా ఎం. వెంక‌య్య‌నాయుడు బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 
 
ఈ సంద‌ర్భంగా కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ, స‌మాచార శాఖ కార్య‌ద‌ర్శి అజ‌య్ మిట్ట‌ల్, రాజ్య‌వ‌ర్ధ‌న్ రాథోడ్ హాజ‌రై, వెంక‌య్య‌కు అభినంద‌న‌లు తెలిపారు. వివిధ మీడియా యూనిట్లు ప్ర‌జా స‌మాచారం అందించేందుకు అత్యున్న‌త బ్రాండ్లు క‌లిగి ఉన్నాయ‌ని తెలిపారు. ఇదే శాఖ‌కు ప‌నిచేసిన అరుణ్ జైట్లీ నుంచి చార్జి తీసుకున్న వెంక‌య్య ఆయ‌న్ని అభినందించారు.

వెబ్దునియా పై చదవండి