ప్రముఖ గాంధేయవాది నంజుండయ్య కన్నుమూత

గురువారం, 28 అక్టోబరు 2021 (09:05 IST)
ప్రముఖ గాంధేయవాది, శ్రమదాన ఉద్యమానికి సుబ్బారావు ఆద్యుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత సలేమ్ నంజుండయ్య సుబ్బారావు ఇకలేరు. ఆయన వయసు 92 సంవత్సరాలు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన రాజస్థాన్ రాష్ట్రంలోని జైపూర్‌లో కన్నుమూశారు. 
 
ఎస్ఎన్ సుబ్బారావు మృతిపై భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. చిన్నతనంలోనే గాంధీజీ బోధనల పట్ల ఆకర్షితులై సామాజిక సేవలోనే సాగిన వారి జీవితం ఆదర్శనీయమని పేర్కొన్నారు. 
 
ఎస్ఎన్ సుబ్బారావు తనతో ఎంతో అభిమానంగా ఉండేవారని వెంకయ్యనాయుడు వెల్లడించారు. యువతను వ్యాయామం వైపు ప్రోత్సహించి వారి జీవితాలను తీర్చిదిద్దారని కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నానని, వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు