బాత్రూమ్‌లో స్నానం చేద్దామని వెళ్తే.. పాములే పాములు.. 30కిపైగా..?

సెల్వి

మంగళవారం, 28 మే 2024 (12:21 IST)
Snakes
అస్సాంలోని నాగోన్ జిల్లాలో ఓ ఇంటి నుంచి కనీసం 30కి పైగా పాము పిల్లలు బయటకు వచ్చాయి.
తమ బాత్‌రూమ్‌లో ఈ పాములు కనిపించాయని స్థానికులు తెలిపారు.
 
ఈ విషయం నాగావ్‌లోని సబ్ డివిజన్ పట్టణమైన కలియాబోర్‌లో చోటుచేసుకుంది. అస్సాం - నాగావోస్ జిల్లాలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు బాత్రూమ్ లోకి వెళ్లగా.. అక్కడ వాటర్ ట్యాంక్ పక్కకి రెండు మూడు పాముల తలలు చూశాడు. 
 
వెంటనే భయంతో ఆ వ్యక్తి సమీపంలో ఉన్నవాళ్లని పిలిచాడు.. స్థానికంగా పాముల్ని పట్టే అతడికి సమాచారం ఇవ్వడంతో అతడు వచ్చి వాటర్ ట్యాంక్ ఓపెన్ చేసి చూడగా వాటిలో గుంపులు గుంపులుగా పాములు ఉన్నాయి. 
 
'సర్పమ్ మ్యాన్'గా పిలవబడే స్నేక్ రక్షకుడు సంజీబ్ దేకా పొదిగిన పిల్లలను ఇంటి నుండి సురక్షితంగా బయటకు తీశాడు. అంతకుముందు, అతను కలియాబోలోని టీ ఎస్టేట్ నుండి 55 కిలోల కంటే ఎక్కువ బరువున్న 14 అడుగుల పొడవైన బర్మీస్ కొండచిలువను రక్షించాడు.

Arre baap re 35 snakes nikle assam ke ek ghar ke toilet se ???????? pic.twitter.com/CnEEXmzUX4

— Ankit Khanna (@ankit_khanna) May 27, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు