అయోధ్యకు 155 నదుల నుంచి నీరు.. ఏప్రిల్ 23న జలాభిషేకం

శుక్రవారం, 21 ఏప్రియల్ 2023 (09:03 IST)
ఉజ్బెకిస్థాన్, పాకిస్థాన్, చైనా సహా వివిధ దేశాల నుంచి 155 నదుల నుంచి నీరు అయోధ్యకు చేరింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఏప్రిల్ 23న ఈ నదుల నీటితో రామ్ లల్లా 'జలాభిషేకం' నిర్వహించనున్నారు.
 
టాంజానియా, నైజీరియా, అమెరికా, ఫ్రాన్స్‌, జర్మనీ, బ్రిటన్‌, నేపాల్‌, భూటాన్‌, మాల్దీవులు, బంగ్లాదేశ్‌ వంటి దేశాల నుంచి కూడా నీటిని తెప్పించుకున్నారని ఢిల్లీ బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే విజయ్‌ జాలీ అన్నారు. అంటార్కిటికా నుంచి నీరు తెప్పించామని చెప్పారు.
 
షెడ్యూల్ ప్రకారం, ఏప్రిల్ 23న మణిరామ్ దాస్ చావ్నీ ఆడిటోరియంలో ఏర్పాటు చేయనున్న వేడుకలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ బృందం నుండి 'జల్ కలష్'ని స్వీకరించిన తర్వాత పూజిస్తారు. ప్రపంచ దేశాల నుంచి తీసుకొచ్చే నీటిలో ఆయా దేశాల జెండాలు, వాటి పేర్లు, నదుల పేర్లతో కూడిన స్టిక్కర్లు ఉంటాయి. ఈ కార్యక్రమంలో పలు దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు.
 
పాకిస్తాన్ నుండి వచ్చిన నీటిని మొదట పాకిస్తాన్ హిందువులు దుబాయ్‌కి పంపారు. ఆపై దుబాయ్ నుండి ఢిల్లీకి తీసుకువచ్చారు. అక్కడ నుండి జాలీ అయోధ్యకు తీసుకువచ్చారు. పాకిస్థాన్‌తో పాటు, సురినామ్, ఉక్రెయిన్, రష్యా, కజకిస్తాన్, కెనడా, టిబెట్‌తో సహా అనేక ఇతర దేశాల నదుల నుండి కూడా అయోధ్యకు నీరు వచ్చింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు