పరాయి మహిళతో లాడ్జీలో అడ్డంగా దొరికిన భర్త

బుధవారం, 2 నవంబరు 2016 (17:53 IST)
చిత్ర పరిశ్రమలో అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి పలువురు యువతులను మోసం చేస్తూ వచ్చిన భర్తను ఓ భార్య చెప్పుతో చితక్కొట్టుడు కొట్టింది. కర్నాటక రాష్ట్ర రాజధాని బెంగుళూరులో ఈ ఘటన జరిగింది. 
 
బెంగుళూరుకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తికి కన్నడ చిత్ర పరిశ్రమతో మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో సినీ అవకాశాలు కల్పిస్తామని పలువురు యువతులకు ఆశకల్పించాడు. ఆయన మాటలను నమ్మిన పలువురు మహిళలు... మంజునాథ్ చెప్పినట్టుగా నడుచుకున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఓ యువతితో మంజునాథ్ లాడ్జిలో ఉండగా అతడి భార్య పద్మ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంది. అక్కడే అతడిని చెప్పుతో చితక్కొట్టింది. అక్కడున్నవారు కూడా పద్మకు మద్దతుగా మంజునాథ్‌కు దేహశుద్ధి చేశారు. యువతితో కూడా భర్తను చెప్పుతో కొట్టించింది. 

వెబ్దునియా పై చదవండి