నిద్రపోయే ముందు మొబైల్ పక్కనే పెట్టుకుంది.. అంతే మహిళ మృతి

సోమవారం, 12 సెప్టెంబరు 2022 (16:13 IST)
Redmi 6A
ఓ మొబైల్ ఫోను ఓ మహిళ ప్రాణాలు బలి తీసుకుంది. నిద్రపోయే ముందు.. మొబైల్ పక్కనే పెట్టుకుంది. అలా చేయడం ద్వారా ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. సదరు మహిళ రాత్రిపూట ఫోన్ వాడిన ఆమె.. దాన్ని తల దగ్గర దిండు పక్కనే పెట్టుకొని పడుకుంది.
 
అర్ధరాత్రి సమయంలో ఆ మొబైల్ పేలిపోయింది. దీంతో తలకు తీవ్రమైన గాయమై విపరీతంగా రక్తం పోయిన ఆమె దుర్మరణం పాలైంది. దీని గురించిన వివరాలను ఎండీ టాక్ అనే యూట్యూబ్ ఛానెల్ నడిపే మంజీత్ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించాడు.
 
'నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయింది. ఆమె రెడ్‌మీ 6ఏ వాడుతోంది. రాత్రి పడుకునే సమయంలో దిండు పక్కనే దాన్ని పెట్టుకొని పడుకుంది. కాసేపటికి అది పేలిపోవడంతో ఆమె చనిపోయింది. ఇది మాకు చాలా విషాదమైన సమయం. మాకు సాయం చేయాల్సిన బాధ్యత బ్రాండ్‌పై ఉంటుంది' అని అతను ట్వీట్ చేశాడు. 
 
ఇది చూసిన నెటిజన్లు రెడ్‌మీపై మండిపడుతున్నారు. సదరు కుటుంబానికి సాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై తాము కూడా విచారణ జరుపుతున్నామని రెడ్‌మీ కంపెనీ తెలిపింది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు