తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు వచ్చింది..

మంగళవారం, 13 జూన్ 2023 (12:13 IST)
బెంగళూరులో ఘోరం జరిగింది. తల్లిని చంపి సూట్‌కేసులో కుక్కి పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చింది.. ఓ కూతురు. నిందితురాలు 39 ఏళ్ల ఫిజియోథెరపిస్ట్. 
 
సూట్‌కేసులో శవాన్ని చూసి పోలీసులు షాకయ్యారు. రోజూ గొడవ పడుతుందనే కోపంతోనే తల్లిని చంపేశానని నిందితురాలు వాంగ్మూలం ఇచ్చింది. 
 
వివరాల్లోకి వెళితే..  పశ్చిమ బెంగాల్‌కు చెందిన 39 ఏళ్ల మహిళ ఫిజియోథెరపిస్ట్. బెంగళూరులో తల్లితో కలిసి ఓ ఫ్లాట్‌లో నివసిస్తోంది. 
 
తల్లి తనతో రోజూ గొడవ పడుతోందని, అందుకే ఆమెను చంపేశానని ఆమె అంగీకరించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు