జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని రాజ్పథ్ వద్ద భారీ యోగా కార్యక్రమం చేపట్టిన విషయం తెలిసిందే. ఈ యోగా డేలో ఉపయోగించిన మ్యాట్స్ కోసం రూ. 92లక్షలు ఖర్చు చేశారు. ఆయుష్ మంత్రి శ్రీపాల్ నాయక్ ఈ విషయాన్ని రాజ్యసభలో రాతపూర్వకంగా తెలిపారు. ఎంఎస్ ఆర్క్ కాన్సెప్ట్ ప్రయివేటు లిమెటెడ్ వారు యోగా డే కార్యక్రమ బాధ్యతలు తీసుకున్నారు.
ఇందుకోసం 37వేల యోగా మ్యాట్స్ను చైనా నుంచి దిగుమతి చేసుకున్నట్లు మంత్రి తెలిపారు. పన్నులతో సహా వీటి కోసం రూ. 92.5లక్షలు ఖర్చు చేసినట్లు పేర్కొన్నారు. యోగా దినోత్సవ నిర్వహణ కోసం రూ.32 కోట్ల రూపాయలను ఖర్చుచేసినట్లు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఇక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు చేసిన ఖర్చు ఎంతో..?