అత్యున్నత మహిళ- పద్మశ్రీ వైరియర్

శనివారం, 16 ఫిబ్రవరి 2008 (16:51 IST)
WD PhotoWD
ప్రపంచ వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల్లో ఒకరిగా భారతీయ సంతతికి చెందిన ప్రవాస భారతీయురాలు పద్మశ్రీ వైరియర్ స్థానం సంపాదించుకున్నారు. సిస్కో కంపెనీలో ముఖ్య సాంకేతిక అధికారిగా పద్మశ్రీ వైరియర్ కొనసాగుతున్నారు. ఇదిలా ఉండగా వాణిజ్య రంగంలో ప్రతిభావంతులైన 15 మంది మహిళల జాబితాను పింక్ పత్రిక ప్రచురించింది.

తాము పని చేస్తున్న కంపెనీలను ఉన్నత శిఖరాలకు చేర్చిన మహిళలను ఆ జాబితాలో చేర్చారు. జాబితాలో తొలి స్థానాన్ని మోటరోలా సీటీవో దక్కించుకున్నారు. 2007 డిసెంబర్ మాసంలో వైరియర్ సిస్కో కంపెనీలో చేరారు. 47 సంవత్సరాల పద్మశ్రీ వైరియర్ ఆంధ్రప్రదేశ్‌లో గల విజయవాడ నగరంలో పుట్టి పెరిగారు.

వెబ్దునియా పై చదవండి