ఏకాదశి అనేది విష్ణువుకు అంకితం చేయబడిన పవిత్రమైన రోజు. ఏకాదశి ప్రతి నెలలో రెండుసార్లు వస్తుంది, శుక్ల పక్షం, కృష్ణ పక్షం రెండింటిలోనూ ఏకాదశి వస్తుంది. వరూథిని ఏకాదశి అనేది ముఖ్యమైన ఏకాదశి పండుగలలో ఒకటి. ఇది చైత్ర లేదా వైశాఖలో కృష్ణ పక్షం 11వ రోజున జరుపుకుంటారు. వరూధిని ఏకాదశి విష్ణువు వామన అవతారానికి అంకితం చేయబడింది.
ఈ పవిత్రమైన రోజును ఉత్తర భారతదేశంలో వైశాఖ మాసంలో పాటిస్తారు. దక్షిణ భారతదేశంలో, ఈ రోజును చైత్ర మాసంలో పాటిస్తారు. ఈ రోజున ఎవరికైనా లేదా బ్రాహ్మణులకు నీటి కుండను దానం చేయడం వల్ల సూర్యగ్రహణ సమయంలో బంగారం దానం చేసిన ఫలితం దక్కుతుంది. ధాన్యం దానం చేసినా అద్భుత ఫలితాలు ఉంటాయి.
"ఓం వామనాయ నమో నమః" అని స్మరించుకుని దీపం పెట్టుకుంటే సరిపోతుంది. దీపం వెలిగించడంతోపాటు "ఓం నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం వామనాయ నమః" అంటూ సరిసంఖ్యలో ప్రదక్షిణలు చేస్తే అన్ని కష్టాలు తొలగిపోతాయి. వరూథిని ఏకాదశి రోజన వైష్ణవాలయాలైన రాముడు, కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి, లక్ష్మీనరసింహాలయాను దర్శించాలని, ధ్వజస్తంభం వద్ద దీపాలు వెలిగించాలని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
అష్టైశ్వర్యాలు కలగాలంటే లక్ష్మీదేవి విగ్రహానికి పాలల్లో కుంకుమ పువ్వు లేదా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలని, లేదా విష్ణుమూర్తి విగ్రహానికి కూడా కుంకుమ కలిపిన పాలతో అభిషేకం చేయాలని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.
ఏకాదశి రోజున, తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించడం వల్ల ఇంటికి సానుకూల శక్తి లభిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం నిలిచి ఉంటుంది. ఇంటి ప్రధాన ద్వారం సానుకూల శక్తికి ద్వారంగా పరిగణించబడుతుంది. ఈ రోజున, ప్రధాన ద్వారం వద్ద దీపం వెలిగించడం ద్వారా, ప్రతికూల శక్తి ఇంట్లోకి ప్రవేశించదు. జీవితంలో సానుకూలత పెరుగుతుంది.
తల్లి అన్నపూర్ణ వంటగదిలో నివసిస్తుంది. ఈ రోజున, వంటగదిలో దీపం వెలిగించడం ద్వారా, ఇంట్లో ఆహార కొరత ఉండదు. అన్నపూర్ణమ్మ అనుగ్రహం లభిస్తుంది. ఇంకా అరటి చెట్టు కింద అంటే విష్ణువు అరటి చెట్టులో నివసిస్తున్నాడని నమ్ముతారు. వరూధిని ఏకాదశి రోజున, అరటి చెట్టు కింద దీపం వెలిగించడం ద్వారా, శ్రీ హరి అనుగ్రహం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.