"దురంత్ దేవ్" అని 108 సార్లు పలికితే చాలు.. కష్టాలన్నీ పరార్!

సెల్వి

ఆదివారం, 8 సెప్టెంబరు 2024 (19:38 IST)
Durant Dev
దురంతదేవ మంత్రం దత్తాత్రేయునికి అంకితమైంది. దత్తగురువు భక్తుల రక్షకుడు, ఇంకా కష్టాలను తొలగించేవాడు. అలాంటి దత్తాత్రేయుడు "దురంత్ దేవ్" అనే పదాన్ని ఉచ్ఛరించడం ద్వారా కష్టాలను తొలగిస్తాడు. ఈ మంత్రం ఇది అడ్డంకులను తొలగించి మీ లక్ష్యాలను సాధించడంలో మీకు సహాయపడే శక్తివంతమైన మంత్రం. 
 
అత్యధిక కష్టాలు, క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నప్పుడల్లా 108 సార్లు లేదా 1008 సార్లు దురంత్ దేవ్ అనే మంత్రాన్ని పఠించడం ద్వారా సర్వశుభాలు చేకూరుతాయి. అష్టైశ్వర్యాలు చేకూరుతాయి. రుణ బాధల నుంచి ఈ మంత్రం కాపాడుతుంది. 
 
కోరిన కోరికలను ఈ మంత్రం నెరవేరుస్తుంది. ఈ మంత్రాన్ని వయోబేధం లేకుండా అందరూ పఠించవచ్చు. ఈ మంత్రపఠనం ఈతిబాధల నుంచి భక్తులను వెలివేస్తుంది. 
 
లక్ష్యసాధనకు ఈ మంత్రం గట్టిగా పనిచేస్తుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. ప్రతీ రోజూ ఏ సమయంలోనైనా.. తోచినన్ని సార్లు ఈ మంత్రాన్ని పఠించవచ్చునని.. తద్వారా ఆ దత్తాత్రేయ స్వామి కష్టనష్టాల నుంచి విముక్తులను చేస్తాడని విశ్వాసం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు