ఈ రోజున స్వామివారిని ఆరాధిస్తే...?

గురువారం, 4 ఏప్రియల్ 2019 (10:34 IST)
గురువారం అంటే సాయిబాబాకు చాలా ప్రీతికరమైన రోజు. ఈ రోజున స్వామివారిని ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని పండితులు చెప్తున్నారు. శ్రీ సాయి ఎలాంటి వారో తెలుకోవాలని సాయిబాబా భక్తులకే కాదు మనసారా దేవుళ్ళను నమ్ముతూ ఆత్మసాక్షిగా పూజించే భక్తులకు కూడా బాగా గురించి తెలుసుకోవాలని ఉంటుంది. స్వామివారి గురించి తెలుసుకోవాలని ఉన్నప్పుడు తెలుసుకోకుండా ఉండలేం కధా. మరి ఆలస్యం చేయకుండా సాయిబాబా ఎలాంటి వారో తెలుసుకుందాం..
 
బాబా నిత్యం ఆత్మసాక్షాత్కారంలోనే మునిగి ఉంటారు. బాబాకు భువి, దివిపై ఉన్న వస్తువులపై ఎలాంటి అభిమానం ఉండదు. స్వామివారి పలుకులు అమృత బిందువులు. సాయినాధకు బీద, ధనిక తారతమ్యాలు లేవు. అందరూ సమానులే. బాబా మానావమానాలను లెక్కచేసేవారు కాదు. సాయి అందరికీ ప్రభువు, యజమాని. బాబా అందరితో కలసిమెలసి ఉండేవారు. 
 
శ్రీ సాయిబాబా జ్ఞానమూర్తి. శివ భక్తులకు సాక్షాత్తూ పరమేశ్వరుడు. క్లిష్టతరమైన సంసారాన్ని బాగా జయించాడు. బాబాకు శాంతమే భూషణం. మౌనమే అలంకారం. బాగా సారంలో సారాంశం వంటివారు. నశించిపోయే బాహ్యాంశాలపై అభిమానం లేనివారు. బాబా పెదవులపై అల్లామాలికి అనేది నిత్య భగవన్నామస్మరణ. ప్రపంచమంతా మేల్కొని ఉంటే తాను యోగనిద్రలో ఉండేవారు. ఇలాంటి స్వామివారిని గురువారం రోజున ఆలయానికి వెళ్ళి పూజలు చేస్తే సిరిసంపదలు చేకూరుతాయని నమ్మకం.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు