ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుని కృపాకటాక్షాలు

సోమవారం, 27 ఏప్రియల్ 2020 (22:16 IST)
మంగళవారం హనుమంతునికి ప్రీతిపాత్రం అని భక్తుల విశ్వాసం. ఆ రోజున శ్రీ ఆంజనేయుడిని ప్రార్థిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని అంటారు. ఈ మంత్రాన్ని జపిస్తే హనుమంతుని కృపాకటాక్షాలు లభిస్తాయి.
 
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే 
నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే
మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే
 
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ
వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే
తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే 
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ
 
జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే
యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే 
యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే
 
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే 
హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే 
బలినా మగ్రగణ్యాయ నమః పాపహరాయతే
లాభ దోసిత్వేమేవాసు హనుమాన్ రాక్షసాంతక 
 
యశోజయంచ మే దేహి శత్రూన్ నాశయ నాశయ 
స్వాశ్రితానామ భయదం య ఏవం స్తౌతి మారుతిం
హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్. 
 
ఈ ఆంజనేయస్తోత్రం నిత్యం పఠించదగినది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు