సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే కక్ష్యపైకి రావడంతో చంద్రగ్రహణం ఏర్పడుతుంది. బుధవారం అర్థరాత్రి రాత్రి 11.52 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమైంది. 12.52 గంటలకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. ఈ సుదీర్ఘ చంద్ర గ్రహణం 2.33 గంటల వరకు కొనసాగింది.
వందేళ్లకు ఒక్కసారి మాత్రమే చోటుచేసుకునే అత్యంత అరుదైన చంద్ర గ్రహణం బుధవారం సంభవించింది. సాధారణంగా గ్రహణ సమయం కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటే బుధవారం సంభవించినది మాత్రం ఏకంగా గంటన్నర పాటు కొనసాగింది. ఒకే ఏడాదిలో మూడు గ్రహణాలు సంభవించడం 2009లో జరిగింది.
2009కి తర్వాత 2011 జూన్ ఒకటో తేదీ పాక్షిక సూర్య గ్రహణం సంభవించింది. భారత్లో ఇది తెలియకపోయినా, బుధవారం సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడింది. అలాగే జూలై ఒకటో తేదీన సూర్య గ్రహణం సంభవించనుందని ఖగోళ శాస్త్రవేత్తలు అంటున్నారు.
ఈ వరుస గ్రహణాల ప్రభావంతో భూమికి ఎలాంటి అపాయం లేదు. గ్రహణ సమయాల్లో సముద్రపు నీటి ఎత్తు పెరగడం, భూమిపై సూర్యుని ఆకర్షణా శక్తి మాత్రమే అధికంగా ఉంటుందని ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కాగా, సూర్య గ్రహణానికి ముందు 12 గంటల ముందు, చంద్రగ్రహణానికి 9 గంటల ముందు కడుపు ఖాళీగా ఉంచాలి. ఈ నియమం బాలురకు, వృద్ధులకు లేదు. గ్రహణాలు పూర్తయ్యాక స్నానం చేసి భోజనం చేయాలని పండితులు సూచిస్తున్నారు.