పూజా విధి విధానాలు తెలుసుకుని శాస్త్రబద్ధంగా పూజలు చేయడం ద్వారా దేవుని అనుగ్రహం మీకు, మీ కుటుంబ సభ్యులకు లభిస్తుందని పురోహితులు చెబుతున్నారు. ముఖ్యంగా పుష్ప పూజకు ఉదయం 5.30 నుంచి 6.30 గంటల సమయం లోపు చేస్తే అనుకున్న పనులు పూర్తవుతాయి.
అలాగే మధ్యాహ్న పూజా కాలంలో పుష్ప పూజ చేస్తే జీవితంలో ఒడిదుడుకులు లేని సమానమైన జీవితాన్ని గడపవచ్చును. సాయంకాల పూజతో దేవుని భక్తి మరియు సమస్త కష్టాల పరిహారంతో పాటు సమస్త దుఃఖం రోగాల నుంచి విముక్తి పొందుతారు.
కానీ రాత్రి సమయంలో చేసే పుష్ప పూజతో ఆరోగ్యం పాడు కాక తప్పదని పురోహితులు హెచ్చరిస్తున్నారు. మధ్యరాత్రి పూజతో ఆయస్సు తగ్గిపోతుందని పురోహితులు అంటున్నారు.