కలియుగ వైకుంఠం శ్రీవారి ఆలయంలో అపచారం జరిగింది. తిరుమలలో భద్రత కరువైందనే విషయం మరోసారి బయటపడింది. పవిత్రమైన తిరుమల పుణ్యక్షేత్రంలో అన్యమతస్థులకు ప్రవేశం నిషిద్ధమనే విషయం తెలిసిందే. ఒకవేళ హిందూ మతంపై మక్కువతో ఎవరైనా వెళ్లినా, వారు హిందూ మతాన్ని, సంప్రదాయాలను గౌరవించాల్సి ఉంటుంది.
అలా గౌరవించకుండా గతంలో ఓ క్రైస్తవ పాస్టర్ ప్రవర్తించగా.. తాజాగా ఓ ముస్లిం తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 1 వద్దకు వెళ్లి...అక్కడ నమాజ్ చేశాడు. దీనిపై ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. మక్కాకు వెళ్లి అభిషేకం చేస్తే ఇలాగే ఉంటుందా అంటూ హిందూ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. కాగా నమాజ్ చేసిన వ్యక్తి బెంగాల్కు చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. అయితే శ్రీవారి ఆలయంలో ఇలా నమాజ్లు చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.