వర్షాల కోసం తెలుగు రాష్ట్రాల్లో యజ్ఞ, యాగ, అభిషేకాలు!

మంగళవారం, 18 ఆగస్టు 2015 (16:56 IST)
వర్షాలు లేక దేశ వ్యాప్తంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో వర్షాల కోసం యజ్ఞ, యాగ, అభిషేకాలు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ నిర్ణయించింది. తిరుమల దేవస్థానం సహా అన్ని దేవాలయాల్లో యజ్ఞాలు చేయాలని దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలయ భూముల దస్త్రాలు, పట్టాదార్ పాస్ పుస్తకాల క్రమద్ధీకరణకు కూడా ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని దేవాదాయ శాఖ పేర్కొంది.
 
మరోవైపు వర్షాల కోసం తెలంగాణ దేవాలయాల్లో వరుణ యాగాలు, రుద్ర హోమాలు, వరుణ జపాలు నిర్వహించేలా దేవాదాయశాఖ అధికారులను ఆదేశించాలని దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డికి తెలంగాణ అర్చక సమాఖ్య విజ్ఞప్తి చేసింది. గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించిన తెలంగాణ ప్రభుత్వానికి అర్చక సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది.

వెబ్దునియా పై చదవండి