కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఐవీఆర్

శుక్రవారం, 17 మే 2024 (19:14 IST)
వేసవిలో వర్షపు జల్లులు. దక్షిణాది రాష్ట్రాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసాయి. హైదరాబాదులో వర్షం ముంచెత్తింది. తమిళనాడులో కూడా వర్షం బాగానే పడింది. దీనితో కొండప్రాంతంలోని వాటర్ ఫాల్స్ జలకళతో కనిపించాయి. దాంతో పర్యాటకులు తమిళనాడులో కుట్రాళం వాటర్ ఫాల్స్‌కి క్యూ కట్టారు. ఇక్కడ పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారి కొండ పైనుంచి వరద ఉధృతమైంది.
 
దీనితో స్నానం చేస్తున్నవారంతా అక్కడి నుంచి పరుగులు తీసారు. ఓ పెద్దాయన... అడె గొయ్యాల ఇంద పక్క వాడా( అరేయ్ ఇడియట్, ఇటువైపు రారా) అంటూ పెద్దగా కేకలు వేసినా 16 ఏళ్ల బాలుడు రాలేదు. దానితో అతడు ఆ వరద ఉధృతిలో కొట్టుకుపోయాడు. అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

వాటర్ ఫాల్స్ దగ్గర ఒక్కసారిగా పెరిగిన వరద, పరుగులు తీసిన జనం

తమిళనాడు-కుర్తాళం వాటర్ ఫాల్స్‌లో పర్యాటకులు స్నానం చేస్తుండగా ఒక్కసారిగా వరద ఉప్పొంగింది

దీంతో జనం పరుగులు తీయగా అశ్విన్ అనే 16 ఏళ్ల బాలుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడుpic.twitter.com/JaCuh5sgsv

— Telugu Scribe (@TeluguScribe) May 17, 2024

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు