తితిదే ఆధ్వర్యంలో తిరుపతి గోశాల నడుస్తోంది. గోశాలలో పశువులతో పాటు ఏనుగులను తితిదే పోషిస్తోంది. అయితే ఇక్కడే అసలు చిక్కంతా వచ్చింది. పశువులకు ఏమాత్రం మేత వేయకుండా తితిదే సిబ్బంది గాలికి వదిలేస్తున్నారు. అంతేకాదు అపరిశుభ్రమైన నీరు.. వాతావరణం.. ఇలా ఒకటి కాదు.. ఎన్నో విధాలుగా గోశాల అస్తవ్యస్తంగా ఉంది. విషయం తెలుసుకున్న శాసనసభ అమలు హామీల కమిటీ తితిదే గోశాలను ఆకస్మికంగా తనిఖీ చేసింది. గోశాలలోని సౌకర్యాలపై తితిదే జెఈఓను అడిగింది.
తితిదే జెఈఓను నిలదీశారు. అసలు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. గోశాల తీరు ఏమాత్రం బాగా లేదని, కనీసం గోపూజ కూడా ప్రతిరోజు చేయడం లేదన్నారు. ప్రతిరోజు గోపూజను ఖచ్చితంగా చేయాలని ఆదేశించారు. గోశాల తీరుపై అసంతృప్తి వ్యక్తం చేసింది కమిటీ. ఇదే విషయాన్ని స్పీకర్ కోడెల శివప్రసాద్తో పాటు సిఎం చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకెళతామని కమిటీ తెలిపింది.