సరికొత్త వివాదంలో 'ప్రేమ మందిరం'

FileFILE
ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్‌మహాల్ ప్రేమకు ప్రతిరూపంగా భావిస్తుంటారు. వివిధ దేశాధినేతలతో సహా ప్రేమ జంటలను అమితంగా ఆకర్షిస్తుంది. దీన్ని మొఘల్ చక్రవర్తి తన భార్య ముంతాజ్ జ్ఞాపకార్ధం 1631లో నిర్మించినట్టు చరిత్ర చెపుతోంది. అయితే మరికొన్ని ఆధారాలు మాత్రం తాజ్‌మహాల్‌పై సరికొత్త వివాదానికి దారితీశాయి. తాజ్‌మహాల్‌ను ఒక హిందూ రాజు 'తేజో మహాలయం' అనే పేరుతో నిర్మించిన శివాలయమని చెపుతోంది.

దీంతో శివ సైనికులు ఇందులోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు చేసేందుకు ఉపక్రమించారు. ఈ విషయం తెలుసుకున్న సీఆర్‌పీఎఫ్ జవాన్లు వారిని అడ్డుకోవడమే కాకుండా.. 14 మందిని అరెస్టు చేశారు. తాజ్‌ మహాల్‌పై వచ్చిన వాదనల్లో ఇది ఒకటి. ఇక రెండోది.. పీఎన్.ఓక్ అనే రచయిత రాసిన తన గ్రంథంలో తాజ్‌ మహాల్ ఒక హిందూ శివాలయమని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నట్టు ప్రకటించారు.

ఇందుకోసం ఆయన రెండు ముఖ్య కారణాలను చూపుతున్నారు. అందులో ఒకటి.. ఒక ముస్లిం రాజు తన భార్య పేరులో రెండు అంక్షరాలను తీసుకొని (తాజ్) ఈ మందిరాన్ని నిర్మించినట్టు చరిత్రలో ఎక్కడా లేదు. అలాగే పూర్వపు ముస్లిం రాజులు మహాల్ పేరుతో నిర్మించిన మసీదులు, మందిరాలు ఎక్కడా నిర్మించిన దాఖలాలు లేవన్నది ఈ రచయిత వాదన. ఏదీ ఏమైనా.. ప్రేమకు ప్రతిరూపంగా చెప్పుకునే ఈ పాలరాతి మందిరం తాజాగా వివాదాల్లోకి ఎక్కింది.

వెబ్దునియా పై చదవండి