అరుణ్ జైట్లీ బడ్జెట్ 2018, నమ్మకం పోయిందా? స్టాక్ మార్కెట్ డౌన్...

గురువారం, 1 ఫిబ్రవరి 2018 (20:35 IST)
కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2018-19 దెబ్బకు స్టాక్ మార్కెట్ కుదేలైంది. సెన్సెక్స్ నష్టాల్లో నడుస్తోంది. దేశీయ మదుపర్లలో బడ్జెట్‌ అలర్ట్‌ మొదలవడంతో ఆరంభంలో లాభాలతో సాగిన దేశీయ మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. సెన్సెక్స్‌ 463 పాయింట్లు కోల్పోయి 35,501 వద్ద, నిఫ్టీ 148 పాయింట్ల నష్టంతో 10,878 వద్ద ముగిసింది. మొత్తమ్మీద ఈ బడ్జెట్ ఎన్డీఏకు ఆఖరి బడ్జెట్ కావడంతో ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కానీ అవేమీ లేకుండా చాలా చప్పగా సాగిపోయింది బడ్జెట్ అని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు