భారత స్టాక్ మార్కెట్ మంగళవారం కుప్పకూలింది. బాంబే స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్ సూచీ ఏకంగా 538 పాయింట్ల మేరకు కోల్పోయింది. ఫలితంగా అక్టోబర్ 28వ తేదీ తర్వాత తొలిసారి సెన్సెక్స్ 27 వేల దిగువకు పడిపోయింది. 13 నెలల కనిష్ట స్థాయికి రూపాయి విలువ పతనమవడం, ద్రవ్యోల్బణం సున్నాకు పడిపోవడం, అంతర్జాతీయ మార్కెట్లు నష్టాల్లో ఉండటం తదితర కారణాలతో మార్కెట్లు కుప్పకూలాయి.
మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 538 పాయింట్లు కోల్పోయి 26,781కి పడిపోయింది. నిఫ్టీ 152 పాయింట్లు పతనమై 8,068కి దిగజారింది. ఈ ట్రేడింగ్లో జెట్ ఎయిర్వేస్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, టీసీఎస్, ఐడియా సెల్యులార్ కంపెనీల షేర్లు లాభపడగా... పీఎంసీ ఫిన్కార్ప్, యూనిటెక్, జైన్ ఇరిగేషన్, పిపావావ్ డిఫెన్స్ సంస్థల షేర్లు నష్టపోయాయి.