డబుల్స్‌లో భారత్‌దే పైచేయి: సోమదేవ్

డేవిస్ కప్ గ్రూప్ ప్లే సమరం పోటా పోటీగా జరుగుతుందని భారత నెంబర్ వన్ టెన్నిస్ ఆటగాడు సోమదేవ్ వర్మన్ అన్నాడు. దక్షిణాఫ్రికాతో జరుగబోయే డేవిస్ కప్ గ్రూప్ ప్లే‌లో ఇరు జట్లు గట్టిపోటీని ప్రదర్శించే అవకాశాలున్నాయని, కానీ అద్భుతమైన డబుల్స్ జట్టు వల్ల భారత్‌దే కొద్దిగా పైచేయి అని సోమదేవ్ వెల్లడించాడు.

ఈ టోర్నీలో ఇరు జట్లు సమాన అవకాశాలున్నాయని, అయితే డబుల్స్ విభాగంలో భారత్ రాణించే అవకాశముందని సోమదేవ్ అభిప్రాయం వ్యక్తం చేశాడు.

ఇదిలా ఉండగా.. ఆసియా-ఓషియానా గ్రూప్-1లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌కు వాకోవర్ లభించింది.

వెబ్దునియా పై చదవండి